జహీరాబాద్ (స్వాతి డిజిటల్ న్యూస్): రైలు ప్రయాణీకుల సౌకర్యార్థం రైల్వే శాఖ టికెట్ రద్దు (క్యాన్సిలేషన్) ఛార్జీల విషయంలో నూతన నిబంధనలను తీసుకువచ్చింది. ఈ కొత్త మార్పులు ఏప్రిల్ 1 నుండి 15వ తేదీ మధ్య అమలులోకి రానున్నాయి. ప్రయాణానికి ముందు టికెట్ రద్దు చేసుకునే సమయాన్ని బట్టి తిరిగి ఇచ్చే నగదు (రీఫండ్) మొత్తంలో మార్పులు చేశారు.
నూతన నిబంధనల వివరాలు:
- 72 గంటల ముందు: ప్రయాణ సమయానికి 72 గంటల కంటే ముందే టికెట్ రద్దు చేసుకున్నట్లయితే, నామమాత్రపు రుసుము మినహాయించి పూర్తి నగదును ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తారు.
- 72 నుండి 24 గంటల లోపు: ఒకవేళ ప్రయాణానికి 72 గంటల నుండి 24 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే, మొత్తం టికెట్ ధరలో 25 శాతం నగదును మినహాయించుకుంటారు.
- 24 నుండి 8 గంటల లోపు: ప్రయాణానికి ఒక రోజు (24 గంటలు) నుండి 8 గంటల ముందు వరకు టికెట్ రద్దు చేసుకుంటే 50 శాతం నగదు కోత విధిస్తారు.
- 8 గంటల లోపు: ప్రయాణ సమయానికి కేవలం 8 గంటల సమయం మాత్రమే ఉన్నప్పుడు టికెట్ రద్దు చేసుకుంటే, ఎలాంటి నగదు తిరిగి చెల్లించబడదు.
ఈ నిబంధనలు ఏప్రిల్ మొదటి వారం నుండి అమలులోకి రానున్న నేపథ్యంలో, ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను తదనుగుణంగా సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
I do believe all of the concepts you have introduced to your post.
They are really convincing and will certainly work.
Nonetheless, the posts are too quick for beginners. Could you please
extend them a little from subsequent time?
Thanks for the post.