కార్మిక పక్షపాతి సి.ఐ.టి.యు గెలుపే లక్ష్యం: రాక్ వూల్ ద్వార సభలో నేతల పిలుపు

కార్మిక పక్షపాతి సి.ఐ.టి.యు గెలుపే లక్ష్యం: రాక్ వూల్ ద్వార సభలో నేతల పిలుపు

G Narsimulu
Highlights
  • Swathi Narsimulu

స్థానిక కోహీర్ మండల పరిధిలోని కవేలి గ్రామంలో గల రాక్ వూల్ (సెయింట్ గోబెన్) పరిశ్రమలో జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో భారీ ద్వార సభ నిర్వహించబడింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సి.ఐ.టి.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ జె. మల్లికార్జున్ గారు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కార్మికులను బానిసలుగా మార్చే చట్టాలను అడ్డుకోవాలంటే సి.ఐ.టి.యును భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

అనంతరం సి.ఐ.టి.యు జిల్లా మరియు యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ బీరం మల్లేష్ గారు మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీల అమలుతో పాటు, మెరుగైన వేతన ఒప్పందం మరియు ఇతర సౌకర్యాల సాధన కోసం సి.ఐ.టి.యు నిరంతరం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. చుక్క గుర్తుపై ఓటు వేసి సి.ఐ.టి.యు అభ్యర్థులను విజయ తీరాలకు చేర్చాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ క్లస్టర్ కన్వీనర్ ఎస్. మహిపాల్, యూనియన్ ప్రధాన కార్యదర్శి బి. నారాయణ, మరియు వివిధ విభాగాల నాయకులు నరేష్, మహేశ్వర్, నరసయ్య, సందీప్ రెడ్డి, రవి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Share This Article
2 Comments