సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

Siddhartha High School bids farewell to 10th grade students

G Narsimulu

మార్చ్ 9 స్వాతి డిజిటల్ న్యూస్ జహీరాబాద్.

సిద్ధార్థ ఉన్నత పాఠశాల ఆవరణంలో పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక అత్యంత వైభవంగా మరియు ఉత్సాహభరితమైన వాతావరణంలో నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్ రెడ్డి మరియు డైరెక్టర్ మోహన్ రెడ్డి నేతృత్వం వహించగా మధుసూదన్ ఆంజనేయులు అమర్నాథ్ మరియు విజేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం పలు సూచనలు చేస్తూ ప్రసంగించారు తొమ్మిదో తరగతి విద్యార్థులు తమ అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు సంప్రదాయ నృత్యాలు మరియు గీతాలాపనలతో పాఠశాల ప్రాంగణం కళకళలాడగా విద్యార్థుల నైపుణ్యాలను చూసి అతిథులు అభినందించారు ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల పట్ల భయాన్ని వీడాలని కోరుతూ పరీక్షా కేంద్రాల వద్ద పాటించవలసిన నియమ నిబంధనలను అక్కడి వాతావరణాన్ని పిల్లలకు కూలంకషంగా వివరించడమే కాకుండా సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత చిత్తంతో పరీక్షలు రాయాలని దిశానిర్దేశం చేశారు అనంతరం ప్రధానోపాధ్యాయులు శేఖర్ రెడ్డి పరీక్షా సమయపాలనపై విలువైన సూచనలు చేస్తూ ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా అందంగా ఎలా రాయాలో వివరించారు మరియు క్రమశిక్షణే విజయానికి తొలి మెట్టు అని ఉద్ఘాటిస్తూ కేవలం మార్కులే కాకుండా మంచి ప్రవర్తన కూడా ముఖ్యమని గుర్తు చేశారు ఈ వేడుకలో పదో తరగతి విద్యార్థులకు పాఠశాల తరపున ప్రత్యేక జ్ఞాపికలను అందజేయగా తొమ్మిదో తరగతి విద్యార్థులు తమ పెద్దలకు ప్రేమపూర్వకమైన కానుకలను అందించి వారిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు కార్యక్రమం ముగింపులో విద్యార్థులు తమ గురువులకు పాదాభివందనం చేస్తూ వారి వద్ద నేర్చుకున్న పాఠాలను స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనవ్వగా ఉపాధ్యాయ బృందం విద్యార్థులను దీవించి వారు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ వీడ్కోలు పలికారు.

Share This Article
42 Comments